15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

నడిగడ్డలో ఫ్యాక్షన్ తరహా మర్డర్

26-01-2026 12:25 PM

కళ్లలో కారం చల్లి....ఆపై కత్తులతో పొడిచి వ్యక్తిని హత్య

అలంపూర్ జనవరి 26: ఒకప్పుడు ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవల  జరుగుతుండేవి. ఫ్యాక్షన్ గొడవల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు చిన్నభిన్నమయ్యేవి.కాలక్రమేణా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఫ్యాక్షన్ గొడవలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో కొంతమేర ప్రశాంతమైన వాతావరణం కనిపించేవి.కానీ ఇంకా అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతి అక్కడక్కడ కనిపిస్తోంది.

అలాంటి ఫ్యాక్షన్ తరహాలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపిన ఘటన నడిగడ్డ ప్రాంతం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామ శివారులో  ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ 43 మరో వ్యక్తి కలిసి రాత్రి గ్రామ శివారులోని ఒక పొలంలో మద్యం తాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతి కిరాతకంగా దాడి చేశారు.ఈ దాడిలో కృష్ణయ్య గౌడ్ అక్కడిక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.స్థానిక ఎస్సై శేఖర్,తన సిబ్బందితో కలిగి ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.