27-06-2025 03:09:23 PM
కొత్తపల్లి, (విజయక్రాంతి): నిగమ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ రెండవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు(Farewell program) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బివీఆర్ గోపాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం చేయడం కాదు పది మందికి ఉద్యోగం కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. తదుపరి జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్ మాట్లాడుతూ కష్టపడి చదువుతూ అనుకున్నది సాధించాలని,ఎంత కష్టమచ్చిక చదువును వదులుకోవద్దు అని విద్యార్థులకు సూచించారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థుల సాంసృతిక కార్యక్రమలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంబీఏ హెచ్ఓడి వహీద్, వాగేశ్వరీ విమెన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమణ చారి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.