calender_icon.png 27 June, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయని నగరపాలక సంస్థ

27-06-2025 03:07:58 PM

కొత్తపల్లి: కరీంనగర్ మున్సిపాలిటీలో(Karimnagar Municipality) నూతనంగా విలీనమైన  దుర్షెడ్ గ్రామం  ప్రస్తుతం 4వ డివిజన్ గా ఏర్పాటయింది. కేవలం నగరపాలక సంస్థలో కలిసిన పేరే కానీ మౌలిక సదుపాయాలను కల్పించడంలో  నగరపాలక సంస్థ చొరవ తీసుకోవడం లేదు. దుర్షెడ్ డివిజన్ లో కనీస సౌకర్యాలు లేని స్మశాన వాటికే ఇందుకు నిదర్శనం. స్మశాన వాటికలో ఇబ్బందులు ఉన్నాయని  నెల క్రితం  ప్రజలు పిర్యాదు చేయగామున్సిపల్ సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా వచ్చి పిచ్చి మొక్కలు మాత్రమే తొలగించి చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. కానీ ఇప్పటికి నల్లాలు,కానీ విధ్యుత్ దీపాలను  ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.  ఎవరైనా చనిపోతే కనీసం స్నానాలు చేయడానికి కూడ స్మశాన వాటిక లో ఉన్న  స్నానాల గదిలో ఎలాంటి సౌకర్యాలు చేస్తలేరు.

పైప్లైన్ డ్యామేజ్ అయి గత నాలుగు ఐదు నెలలైన వాటి రిపేర్  చేస్తలేరు.ఈ నెలలో  ఇప్పటివరకు  గ్రామంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయినారు. వారి అంత్య క్రియలు చేసిన తరువాత స్నానం  చేద్దామంటే బయట రోడ్లపై స్నానం చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డివిజన్ కు చెందిన మహిళలు. అదేవిధంగా రాత్రి వేళల్లో  ఎవరిరైన చనిపోతే వారి అంత్య క్రియలు చేద్దాం అంటే విద్యుత్ దీపాలు లేఖ వాహనాలు స్టార్ట్ చేసి వాటి వెలుతురు లో అంత్య క్రియలు చేసుకుంటున్నామని  డివిజన్ ప్రజలు వాపోతున్నారు.  ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వచ్చి దుర్షెడ్ డివిజన్లో స్మశాన వాటిక పరిశీలించి  మౌలిక వసతులు కల్పించాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.