22-06-2025 12:14:51 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో రైతులను ఆర్థికం గా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. శుక్రవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అయ్యాయి.
ఇందుకోసం ప్రభుత్వం రూ.905.89 కోట్లు విడుదల చేసింది. శనివారం 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రూ.460.24 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు విడతల్లో రూ.7770.83 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేయగా, 66.19 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద రైతులకు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.