22-06-2025 12:25:58 AM
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టే రాజకీయం నడుస్తోంది. గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తీసుకుపోయే విధంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆ ప్రాజె క్టు అక్రమమని, పనులను అడ్డుకోవాలంటూ తెలంగాణ సర్కారు ఇప్పటికే కేం ద్ర ప్రభుత్వానికి ఉత్తరాలే మీద ఉత్తరాలు రాసింది. అంతేకాదు సీఎం రేవంత్రెడ్డి, భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి హస్తినకు వెళ్లి కేంద్ర అమా త్యులను కలిసి మరీ గోడు వెళ్లబోసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు బనకచర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏలో భాగస్వామి పార్టీలైన టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఒకవేళ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన ఇస్తే, తెలంగాణలో బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ చేతగాని తనం వల్లే బనకచర్లకు అడుగులు పడుతున్నాయంటున్నది. కాంగ్రెస్ పెద్దలేమో.. ఇది నాటి సీఎం కేసీఆర్ పాపమేనని ఎవరికి వారు బాల్ను అవతలి కోర్టులోకి విసిరేస్తున్నారు.
పెద్ది విజయ్భాస్కర్