30 June, 2026 | 9:44 PM

Breaking News

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •  

కరెంటు షాక్‌తో రైతు మృతి

08-08-2025 01:22 AM

కొండపాక,ఆగస్టు7: కరెంటు షాక్ తో రైతు మృతి చెందిన ఘటన కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సిరిసనగండ్ల గ్రామానికి చెందిన గూడెపు బాపురెడ్డి (64) బుధవారం తెల్లవారుజామున మొక్కజొన్న పంటకు నీళ్లు పారించడానికి వెళ్లాడు. మృతుని భార్య భాగ్యమ్మ ఉదయం ఏడు గంటలకు బావి వద్దకు వెళ్లి తన భర్తను పిలుస్తూ బోరు స్టార్టర్ వద్దకు వెళ్లి చూడగా బాపురెడ్డి కింద పడి తీవ్ర అస్వస్థతకు గురై ఉన్నాడు.

ఆమె తన భర్తను కాపాడడానికి కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న రైతులు బాపురెడ్డి  కాలుకు తగిలిన వైరును తప్పించినారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో పొలం నుంచి రోడ్డుకు వచ్చేలోపే తుది శ్వాస విడిచినట్లు స్థానికులు తెలిపారు. బోరు స్టార్టర్ వద్ద తేలి ఉన్న కరెంటు వైర్ మృతుని కాలుకు తగిలి షాక్ సంభవించిందని మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.