30 June, 2026 | 10:38 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

08-08-2025 01:23 AM

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): సైబర్ నేరాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలపై గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాఠశాల బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని మహబూబాబాద్ షీ టీం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర సునంద మాట్లాడుతూ నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని,

జాగ్రత్తతో మెలగడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని సూచించారు. షీ టీం, భరోసా, యాంటీ వుమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్ పై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే 8712656935 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ కోటియా నాయక్, షీ టీం, భరోసా సిబ్బంది అరుణ, పార్వతి, సౌభాగ్య, రమేష్, జోష్ణ, రేణుక పాల్గొన్నారు.