07-05-2025 12:39:55 AM
ఏఇఓ సంతోష్ కుమార్
నాగల్ గిద్ద, మే 6: నాగల్ గిద్ద మండలంలోని దామరిద్ద క్లస్టర్ రైతు వేదికలో ఏఈఓ సంతోష్ మాట్లాడుతూ ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని ఈ ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందనీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.