02-09-2025 08:30:37 AM
గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ దగ్గర యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచే లైన్ లో టోకెన్ల కోసం వేచి ఉన్నారు. రెండు సంచుల ఏరియా కోసం పనులు వదులుకొని ఉదయం నుంచి రాత్రి వరకు పడి గాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.