03-07-2025 05:21:00 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎంజాయ్ మెంట్ సర్వే ఆధారంగా భూభారతిలో తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం నారాయణపురం రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడవరోజు చేరాయి. ఈ దీక్షలో మాజీ ఎంపిటిసి ధరావత్ రవి, నరసింహారెడ్డి, వెంకట్రెడ్డి, అమరేందర్ రెడ్డి, పద్మ, వాల్యా, వీరన్న, సరోజన, ధనమ్మ, లచ్చమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.