05-06-2025 12:40:38 AM
మంత్రి పొన్నంకు ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ సహా మిగతా కార్మిక సంఘాలు, కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఈ ప్రక్రియను నిలిపేసినట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. జేఏసీ చేసిన విజ్ఞప్తులకు మంత్రి పొన్నం స్పందించి ఈ నిర్ణయం తీసుకుని, కార్మికుల పక్షాన నిలిచారని, అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెంకన్న పేర్కొన్నారు.