12 June, 2026 | 4:59 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

15-10-2025 09:54 PM

తహసిల్దార్ కవిత..

గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసిల్దార్ బండ కవిత కోరారు. బుధవారం మండలంలోని పొనుగోడు గ్రామంలో ఖరీఫ్ సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం అమ్మేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. కార్యక్రమంలో పిఏ సిఎస్ చైర్మన్ జె కమల, మండల వ్యవసాయ అధికారి ప్రియతమ కుమార్, ఏఈఓ మనోజ్ కుమార్, ఆడిటర్ నారాయణస్వామి, రాజు సంగం సెక్రటరీ అందే ఉపేందర్, పిఎసిఎస్ సిబ్బంది, పలువురు రైతులు తదితరు పాల్గొన్నారు.