calender_icon.png 23 August, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కాంటా చేయడం లేదని రోడ్డెక్కిన రైతులు

23-04-2025 10:13:54 PM

గంట పాటు రైతుల రాస్తారోకో..

కామారెడ్డి జిల్లాలో పాలు చోట్ల నిరసనలు..

కామారెడ్డి (విజయక్రాంతి): ధాన్యం కాంటా చేయడం లేదని కామారెడ్డి జిల్లాలో రైతులు రోడెక్కారు. గంట పాటు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన కూడా కాంటా చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పాటు పోతంగల్ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ కు వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి తమ సమస్యను విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ధాన్యం కొనుగోలు చేపడతామని రైతులకు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. రామారెడ్డి మండల కేంద్రంలో గంట పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.