16 March, 2026 | 11:14 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రైతు పండుగను వీక్షించిన రైతులు

30-11-2024 07:17 PM

మందమర్రి (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రైతు పండుగ-రైతు సదస్సును మండలంలోని రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమాన్ని మండలంలోని రైతు వేదికలో మండల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు పండుగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, ఇతర రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్మయి, ఏఈఓలు ముత్యం తిరుపతి, కనకరాజు, మండలంలోని రైతులు పాల్గొన్నారు.