13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

28-03-2026 12:28 AM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని మక్కలు విక్రయించాలి 

మహబూబాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని చెప్పారు. రైతులకు సాగు పెట్టుబడి రైతు భరోసా ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలను విక్రయించి క్వింటాలుకు 2400 రూపాయలు చొప్పున రైతులు గిట్టుబాటు ధర పొందాలని కోరారు. మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పాలకమండలి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ల చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్ నాయక్, గంటా సంజీవరెడ్డి, మహబూబాబాద్ కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్లు జ్యోతి రమేష్, సునీత వెంకన్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.