26-06-2025 10:55:03 AM
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్(Kodad Town Bypass)లోని దుర్గాపురం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్ నలుగురు సిబ్బందితో కలిసి ఓ కేసు విషయమై అర్ధరాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు.
ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.