15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అయ్యో.. పాపం

26-03-2025 12:54 AM

అనుమానాస్పదస్థితిలో 15 రోజుల పసికందు మృతి

బకెట్‌లో తలకిందులుగా మృతదేహం

అలీనగర్ వర్కర్స్ కాలనీలో ఘటన

రాజేంద్రనగర్, మార్చి 25: అనుమానాస్పద స్థితిలో 15 రోజుల పసికందు మృతిచెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. తమిళనాడుకు చెందిన దంపతులు ముడలి మణి, ఆరోజియా విజి నాలుగేళ్ల క్రితం వలస వచ్చి అలీనగర్ వర్కర్స్ కాలనీలో అద్దెకు ఉంటూ స్థానిక బిస్కెట్ కంపెనీలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి ఇప్పటికే ఏడాది కొడుకు ఉన్నాడు. 13 రోజుల క్రితం అరోజియా విజి మరో పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా, మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు అరోజియా విజి తన 15 రోజుల పాపను మంచంపై పడుకోబెట్టి స్నానానికి వెళ్లింది.

10 నిమిషాల తర్వాత వచ్చి చూడగా పాప కనిపించలేదు. ఒక్కసారిగా ఆమె ఆందోళనకు గురై రోదించసాగింది. స్థానికుల సాయంతో ఇంటి పరిసరాల్లో వెతుకగా ఓ బకెట్‌లో తలకిందులుగా కనిపించింది. బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లి గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.