15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

26-03-2025 12:55 AM
  1. ఆశాలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
  2. సీఐటీయూ మండల కన్వీనర్ పాండవుల రామనాథం 
  3. బూర్గంపాడులో ప్లే కారడ్స్ తో ఆశాల నిరసన

బూర్గంపాడు,మార్చి 25(విజయక్రాంతి): ఆరోగ్య రంగంలో ఆశాలు వెన్నెముక అని పెద్ద పీట వేస్తామని గొప్పగా పొగడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాలను అరెస్టు చేయించడం నిర్బంధించడం సరికాదని, ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సిఐటియు మండల క న్వీనర్ పాండవుల రామనాథం అన్నారు.

బూర్గంపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్లే కారడ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాండవుల రామనాథం మాట్లాడుతూ ఆశాల సమస్యలపై ఛలో హైదరాబాద్ కమీషనర్ కార్యాల యం ముట్టడిలో ఆశాలను అక్రమ అరెస్టు చేశారని ఆయన అన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాల సందర్భంగా ఆశాలకు ఫికస్డ్ గా గౌరవ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని ఆయన అన్నారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని, ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో అడుగడుగు నా బస్టాండ్ రైల్వే స్టేషన్లలో అరెస్ట్ చేసి నిర్బంధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పట్టుతుందని ఆయన అన్నారు.

రాబోయే జెడ్పిటిసి, ఎం పీటీసీ,సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా కెవి పిఎస్ మండల కన్వీనర్ రాయల్ వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఈ తారా దేవి, ఎం.నాగమణి, టి. రత్న కుమారి, కే పార్వతి, పి చిట్టెమ్మ, జి.తిరుపత మ్మ, బి భారతి,జి నాగేశ్వరి, డిబాయమ్మ తదితరులు పాల్గొన్నారు.