03-02-2026 04:29:29 PM
సుదీర్ఘ చర్చల అనంతరం విడుదల చేసిన డిసిసి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ తొలి కార్పోరేషన్ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను డిసిసి అధ్యక్షులు సంజీవ ముదిరాజ్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల అధికారులకు బీఫాంలో అందజేయడంతో ఆ సమయంలోపే జాబితా విడుదల చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ సందర్భంగా డిసిసి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ... పార్టీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, ఎవరు దిగులు చెందకూడదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుందని తెలిపారు. ఎవరు కూడా టికెట్ రాలేదని ఆవేదన చెందకూడదని వారికి భవిష్యత్తులో మరింత మంచి పదవులు దక్కి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 60 మంది కి 60 కార్పొటర్ల ను గెలిపించుకోవాలని సూచించారు. సోమవారం 36 మంది అభ్యర్థులను ఖరారు చేసినప్పటికి మంగళవారం 24 మంది తుది జాబితా ను విడుదల చేసింది.