23-02-2026 12:41:11 AM
రాజాపూర్, ఫిబ్రవరి 22: మండలంలోని కుచ్చర్కల్ గ్రామనికి చెందిన అల్లి వెంకటయ్య (56) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుజయ్ చంద్రా రెడ్డి రూ.5వేలు ఆర్థిక సహాయన్ని ప్రకటించారు. ఆదివారం సుజాయ్ యువసేన సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమ్మరి వెంకటయ్య,జింకల శ్రీను,బోయ శీను,కసరత్ కరుణాకర్,కుమ్మరి మల్లేష్,మాజీ సర్పంచ్ యాదగిరి,కుమార్,చెన్నయ్య,నరేష్,తపెట్ట శివ,బోయ పాండ్రయ్య,వార్డ్ మెంబర్స్ వై బాబు, తదితరులు పాల్గొన్నారు.