18 July, 2026 | 4:52 PM

మానవత్వం చాటుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్

03-08-2025 12:20 AM

బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పట్టణనికి చెందిన బాసం రాజు మరణించిన విషయం తెలుసుకొని, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వారి  కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు 1,00,000/- లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ  పట్టణ కేంద్రంలో ఉంటున్న ప్రజలకు సేవ  చేయడం లక్ష్యంతో పని చేస్తున్నానని, పట్టణ కేంద్రంలో ఉంటున్న ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన, వారికి సేవ చేయడానికి నేను ముందుంటానని, నా ఇంటి తలుపులు వారికి ఎల్లవేళలా తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా అన్నారు.