28 March, 2026 | 3:39 PM

పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం

28-03-2026 02:06 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నందిగామలో శ్రీకృష్ణ పత్తి గోదాంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాప సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది? ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.