ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 21 మంది సజీవదహనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మాలవీయనగర్ లో బుధవారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. కొందరు బాధితులు భవనం రెండు, మూడు అంతస్తుల నుంచి దూకారు. రెస్టారెంట్ లో చిక్కుకున్న 40 మందిని సహాయసిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. భవనం కింది అంతస్తులోని రెస్టారెంట్ లో మంటలు అంటున్నాయి. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదంపై ఉదయం 9.45కు పోలీసులకు సమాచారం అందింది. పది అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.






