దండకారణ్యంలో కాల్పుల మోత!
08-06-2024 01:31 AM
నారాయణ్పూర్ (ఛత్తీస్గఢ్), జూన్ 7: ఛత్తీస్గఢ్లో దండకారాణ్యం కాల్పులతో దద్దరిల్లింది. నారాయణపూర్లోని అడవుల్లో జరి గిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టు లు మరణించగా, ముగ్గురు జవాన్లకు తీవ్ర గా యాలయ్యాయి. ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామం సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ జవాన్లతో పాటు స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు.






