24-06-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం
మిర్యాలగూడ, జూన్ 23: పారంపర్య వైద్య మహా సంఘం ప్రథమ వార్షికోత్సవం జూలై 4, 5, 6 తేదీలలో యాదగిరిగుట్టలో జరుపుటకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని సోమవారం నాడు సంఘం తరఫున హైదరాబాద్ లో తన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వస్తానని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.
వనమూలిక వైద్యమును మరింత విస్తరించి ప్రజలకు మంచి వైద్యం అందించడంతోపాటు జీవన విధానంను నేర్పించాలని భవిష్యత్తులో ప్రమాదకర అనారోగ్యాలు రాకుండా అరికట్టే బాధ్యత వనమూలికా వైద్యలకు ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. పండిట్ శ్రీనివాస్ గురూజీ, యాత్రి మహర్షి, దుర్గారాణి పాల్గొన్నారు.