23-06-2025 11:51:17 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను ప్రభుత్వం అందిస్తుండడంతో కౌటాల మండలం(Kouthala Mandal) గరుడ పెళ్లి గ్రామ మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య తన పిల్లలను ప్రవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విధానం మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతగానో తనకు నచ్చాయని పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు.