24-11-2025 02:19:12 PM
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి-హిండోలఖల్ సమీపంలో సోమవారం ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. గుజరాత్ ఢిల్లీ నుండి వచ్చిన భక్తులతో కూడిన 28 మంది ప్రయాణికులతో కుంజాపురి ఆలయానికి తీర్థయాత్రకు వెళ్తున్న బస్సు దాదాపు 70 మీటర్ల వెడల్పు గల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం ప్రమాద స్థలికి చేరుకొని బస్సులోని వారిని రక్షించి, గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు బృందాలు సహా స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కమాండెంట్ అర్పన్ యదువంశీ నేతృత్వంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ పోస్టుల నుండి ఐదు బృందాలను రక్షణ, సహాయ కార్యకలాపాలను నిర్వహించడానికి నియమించాయి. పోలీసులు సంఘటన స్థలం చుట్టూ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.