17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పరకాలలో తొలిరోజు ఐదు నామినేషన్లు

28-01-2026 10:30 PM

హనుమకొండ,(విజయక్రాంతి): పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులకు నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. 22 వార్డులకు గాను అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకు ఏడు కౌంటర్లను ఏర్పాటు చేయగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజు బుధవారం 7,11,16,18,20 వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పురపాలక కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.