13-11-2025 12:18:09 AM
కల్వకుర్తి టౌన్ నవంబర్ 12: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు బుధవారం న్యాయమూర్తి కావ్య జైలు శిక్ష విధించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన సయ్యద్ గౌస్ కు 4రోజుల జైలు రూ. 500, మల్లికార్జున్ రెడ్డి 3రోజుల జైలు, రూ.600, కడరి మల్లేష్ 2రోజుల జైలు రూ.600, మహమ్మద్ ఖాన్ ఒక రోజు జైలు, రూ.500, తిమ్మరాశిపల్లి కి చెందిన 2రోజుల జైలు రూ.కోట్ల శివయ్య2రోజుల జైలు, రూ.100 ఫైన్ విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ మాధవరెడ్డి పేర్కొన్నారు.