07-11-2025 12:30:03 AM
బిచ్కుంద, నవంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాలికపై లైంగికదాడికి య త్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. 2022 సెప్టెంబర్ 18న బిచ్కుంద మండలంలోని ఓ గ్రామం లో ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన జల్దేవార్ శ్రీనివాస్ అత్యాచారయత్నం చేశాడు.
సదరు బాలిక గట్టిగా అరవడంతో ఇంటికి కాస్త దూరంలో ఉన్న నానమ్మ వచ్చి తలుపులు బాదడంతో ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పొక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పిం చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలించి నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును సరైన పద్దతిలో విచారించిన నాటి బిచ్కుంద సీఐ శ్రీధర్ రెడ్డి పీపీ శేషు, ప్రస్తుత ఎస్ఐమోహన్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీకాంత్ను ఎస్పీ రాజేష్చంద్ర అభినందించారు.