26 June, 2026 | 8:05 PM

ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

20-04-2026 08:35 PM

చిట్యాల,(విజయక్రాంతి): ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం చిట్యాల మండలం అరెగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే పాల్గొని ప్రజలందరూ ఆయురాగ్యోలతో, పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.