26-06-2025 12:55:11 AM
రాజన్న సిరిసిల్ల జూన్ 25 (విజయక్రాంతి)వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు లో భాగంగా ఇండ్ల కూల్చివేతలపై ఇంకా ని రసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి హైకోర్టు స్టే విధించినప్పటికీ అధికారులు భవనాలు కూల్చి వేయడంపై భూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు వేములవాడ కు సం బంధించిన వి టి డి ఏ కు సంబంధించిన భూములలో కొందరు అక్రమంగానిర్మాణా లు చేపట్టి ఉన్నారు.
వారిని వదిలిపెట్టి అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భూ ముల విస్తీర్ణం పూర్తిస్థాయి 95 ఎకరాలు ఉండగా ప్రస్తుతం మిగిలింది ఎంత ఆ లెక్క తేల్చి ఆ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లపై దృష్టి సారించకుండా మా తాత ముత్తాతల నుండి వేములవాడ రాజన్న ని నమ్ముకుని చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న మమ్ములను మా అభిప్రాయాలు సేకరించకుండా అధికారులు ఇస్తారాజ్యంగా ముగింపు వెలగట్టి ఇ వ్వడం ఏంటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నా రు హైకోర్టు స్టే విధించినప్పటికీ లెక్కచేయకుం డా కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
గత ఐదు సంవత్సరాల నుం డి ఉధర్వాగుపై నిర్మాణం చేయబడిన బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేయలేని అధికారులు ప్రభుత్వాలు ఆ బ్రిడ్జిని గాలికి వదిలేసి రోడ్డు వెడ ల్పు లో భాగంగా కూల్చివేతలపై భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుధవారం నాడు పట్టణంలో భూ నిర్వాసితులు బ్లేక్సిలను ఏర్పాటు చేశారు.
ప్లేక్స్ లలో ఏమ ని ముద్రించారు అంటే మేము అభివృద్ధిని అడ్డుకోవడం లేదని హైకోర్టు స్టే విధించినప్పటికీ కూల్చివేయడం ఎంతవరకు సమంజ సం అని ప్రశ్నించడం తప్ప మా ఆస్తుల విలువలను మా ఇష్టానుసారం ముగింపు చేయకుండా తొలగించడం పై భూ నిర్వాసితులు బారమంతా ఆ రాజన్న పైనేనని ఫ్లెక్సీ లో ముద్రించారు. ఇది ఇలా ఉండగా ఏర్పా టు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించేశారు.