2 September, 2026 | 11:05 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

టెక్సాస్‌లో వరదల బీభత్సం

06-07-2025 | 01:33am

24కు చేరిన మృతుల సంఖ్య.. 23 మంది గల్లంతు

వాషింగ్టన్, జూలై 5: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించడంతో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్‌కు వెళ్లిన 23 మంది బాలికల ఆచూకీ గల్లంతయ్యింది. వీరికోసం రెస్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడా లుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి బారీగా వరద నీరు చేరింది. గ్వాడాలుపే నది తీరం లో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్ లో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌ను వరద ముంచె త్తడంతో 23 మంది బాలికలు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు.