23-07-2025 01:09:39 AM
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): నగరంలో వర్షాల వల్ల నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెష ల్ ఫోకస్ పెట్టాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సెంట్రల్ జోన్ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్తో కలసి లక్డీకపూల్ వద్ద మెహదీ ఫంక్షన్ హాల్, పిటిఐ, చీచా రెస్టారెంట్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ను పరిశీలించారు. అప్పటికే అక్కడ నిలిచిన వర్షపు నీరును ఇంజనీరింగ్ అధికారులు తొలగించారు.
అదే చోట ఇరుకుగా ఉండ టం, రోడ్డు లెవెల్ డిఫరెన్స్ ఉండటంతో మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు స్లోగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ తరచుగా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతు న్నాయనీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై తమతో ఉన్న సెంట్రల్ జోన్ చీఫ్ ఇంజనీర్ తో కమిషనర్ ఆర్వి కర్ణన్ చర్చించారు. సాధ్యమైనంత త్వరగా లెవెల్ డిఫరె న్స్ తొలగించడంతో పాటు సీసీ వేయాలని కమిషనర్ చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. అక్కడే అదనంగా మరో లేన్ వచ్చేలా చూడాలన్నారు. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.