calender_icon.png 8 June, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి

06-03-2025 12:48:58 AM

మండల వ్యవసాయ అధికారి ఆర్.వాణి

కూసుమంచి , మార్చి 5 (విజయ క్రాంతి): కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో బుదవారం మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి పర్యటించారు.. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కల్పించారు.

పామాయిల్ సాగు ఆవశ్యకతను రైతులకు వివరించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల్లో పామ్ ఆయిల్ సాగు ప్రాధాన్యత సంతరించుకున్నదని, రైతులందరూ ఈ పంట సాగు చేసేందుకు మొగ్గు చూపాలని కోరారు.

నీటి వసతి బాగా ఉన్న ప్రాంతాలలో ఈ పంటను సాగు చేసుకోవచ్చని, ఒక ఎకరం వరి సాగు చేయడానికి సరిపడా నీటితో మూడు ఎకరాల పామాయిల్ పంటను సాగు చేయవచ్చు అని తెలియజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రియాంక రైతులు పాల్గొన్నారు.