06-03-2025 12:48:58 AM
మండల వ్యవసాయ అధికారి ఆర్.వాణి
కూసుమంచి , మార్చి 5 (విజయ క్రాంతి): కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో బుదవారం మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి పర్యటించారు.. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కల్పించారు.
పామాయిల్ సాగు ఆవశ్యకతను రైతులకు వివరించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల్లో పామ్ ఆయిల్ సాగు ప్రాధాన్యత సంతరించుకున్నదని, రైతులందరూ ఈ పంట సాగు చేసేందుకు మొగ్గు చూపాలని కోరారు.
నీటి వసతి బాగా ఉన్న ప్రాంతాలలో ఈ పంటను సాగు చేసుకోవచ్చని, ఒక ఎకరం వరి సాగు చేయడానికి సరిపడా నీటితో మూడు ఎకరాల పామాయిల్ పంటను సాగు చేయవచ్చు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రియాంక రైతులు పాల్గొన్నారు.