08-06-2025 05:59:33 PM
పాపన్నపేట: 21 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఒకే చోట చదివిన విద్యార్థులు అందరు ఒక్క చోట చేరి బాల్య స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఈ అపూర్వ సంఘటనకు కుర్తివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక అయింది. 2003-04లో పదవ తరగతి పూర్తి చేసుకున్న మిత్రులందరూ ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు చదువుకునే సమయంలో జరిగిన అనుభూతులను తోటి మిత్రులు అప్పటి ఉపాధ్యాయుల సమక్షంలో గుర్తు చేసుకున్నారు.
అనంతరం ఈ కార్యక్రమానికి హాజరు అయిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 21 సంవత్సరాల తరువాత ఇలాంటి అపూర్వ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి గుర్తు పెట్టుకుని తమను ఆహ్వానించి మమ్మల్ని ఈ అపూర్వ కలయికలో భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఎదో రంగంలో రాణిస్తూ ఉన్నారని ప్రతి ఉపాధ్యాయుడికి ఇదే చాలా సంతృప్తి ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమలో ఎవరికైనా ఆపద వస్తే అండగా నిలిచేలా ఉండాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు బాలకిష్టయ్య, శంకర్, సీతారాం, మధుసూదన్ లను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, విట్టల్, సాయి, రాము, కిరణ్, సురేష్, నాగరాజు, కృష్ణ, రాజ్యలక్ష్మి, దుర్గ, సంయుక్త, సుమలత, కళ్యాణి, సువర్ణతో పాటు ఇతరులు పాల్గొన్నారు.