calender_icon.png 23 June, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పశువుల పాకలు, గుడిసెలను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులు

22-06-2025 08:30:32 PM

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి విన్నవించిన రైతులు..

అటవీ శాఖ, కలెక్టర్ తో మాట్లాడిన షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో 14 ఏకరాల భూమిని సుమారు 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఆదివారం ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేస్తూ గుడిసెలు, పశువుల పాకలు, తీసివేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ అటవీశాఖ చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు.

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సలహాదారు షబ్బీర్ అలీని రైతులు కలిసి వివరించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు రైతులు అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ సి డైరెక్టర్ చింతల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజా లింగం, యుగంధర్, సాకలి బాలయ్య, అరిగే నర్సింలు, గుడ్డెల్లి చంద్ర శ్రీనివాస్, నర్సింలు, నీరటి నరసింహులు, నూట ముప్పై మంది రైతులు పాల్గొన్నారు.