30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పులి పాదముద్రలను పరిశీలించిన ఫారెస్ట్ శిక్షణ బీట్ అధికారులు

07-12-2025 08:21 PM

పులి కదలికలపై ఆరా..

బెజ్జూర్ (విజయక్రాంతి): హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 38 మంది బీట్ అధికారులు ఆదివారం బెజ్జూరు అడవుల్లో పర్యటించి వివరాలను తెలుసుకొని క్షేత్ర పర్యటన చేశారు. ఫీల్డ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, స్థానిక అటవీ అధికారుల బృందంతో ఇక్కడి అటవీ ప్రాంత ప్రాముఖ్యతను వివరించారు. మండలంలో కృష్ణపల్లి సెక్షన్ పరిధిలోని ఇందురుగాం బీట్లోని రాముడు భీముడు టేకు చెట్లు, బేస్ క్యాంపును పరిశీలించారు. అనంతరం మాణిక్య దేవారా అటవీ ప్రాంతంలో పులుల ఆవాస ప్రాంతాన్ని పరిశీలించారు.

పులుల కదలికలు, వాటి పాదముద్రలు పరి శీలించి వివరాలను తెలుసుకున్నారు. పెద్దపులి ఎటు నుంచి ఎటువైపు వెళుతుందో పాదముద్రల ఆధారంగా గమనిస్తూ వెళ్లారు. అంతేకాకుండా ఎక్కడి అటవీ ప్రాంతం జీవవైవిద్యంతో కూడిందని ఈ ప్రాంతంలో వివిధ రకాల పక్షులు, వన్య ప్రాణుల గురించి వివరించారు. వారి వెంట రేంజ్ అధికారి ముసావీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్, సెక్షన్ అధికారి సోఫియా, బీట్ అధికారి గోపాల్ ఇతర సిబ్బంది ఉన్నారు.