4 March, 2026 | 2:36 AM

ఆర్థిక సహాయం అందజేత

04-03-2026 12:38 AM

నూతనకల్, మార్చి 3: మండల పరిధిలోని ఎడవల్లి గ్రామానికి చెందిన పిర్నాక్ లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మంగళవారం తుంగతుర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఒక క్వింటా బియ్యాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జటంగి సరితా కృష్ణ, భయ్యా లింగయ్య, గాజుల ఉపేందర్, కొచ్చర్ల బాబు, తూముల వెంకటేశ్వరరావు, బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.