24 April, 2026 | 12:25 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

మానవత్వం మరిచి.. మామపై దాడి

09-12-2024 01:46 AM

వృద్ధుడిపై చెప్పుతో దాడి చేసిన కోడలు

నల్లగొండ జిల్లాలో అమానుషం

నల్లగొండ, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అవసాన దశలో అనారోగ్యంతో కదలలేని స్థితిలో వీల్‌చైర్‌పై బతుకీడుస్తున్న మామపై కనికరం లేకుండా కోడలు విచక్షణారహితం గా దాడికి తెగబడింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో పైశాచిక కోపంతో ఊగిపోతూ చెప్పుతో మొహంపై పదేపదే కొట్టి రాక్షసం గా వ్యవహరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శెట్టిపాలెం గ్రామానికి చెం దిన గగినపల్లి బుచ్చిరెడ్డి(70)కి ఇద్దరు కుమారులు. ఆస్తి కుమారులకు పంచినా ఆయన పేర ఉన్న భూమి విషయంలో కొం తకాలంగా కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న బుచ్చిరెడ్డిపై పెద్ద కోడలు మణిమాల ఇటీవల చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దృశ్యాలు ఇంటి పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

ఆదివారం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొట్టొందంటూ వృద్ధుడు వేడుకుంటున్నా కనికరించకుండా కోడలు వ్యవహరించిన తీరు స్థానికులకు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మణిమాలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.