01-10-2025 01:44:49 PM
కరీంనగర్, (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల అధ్యక్షుల జడ్పీటీసీల ప్రబారిన సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో కలిసి కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వాగతం పలికారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ల్ ల పై బీజేపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.