ఇండియా స్కూల్ కోసం స్థలం కేటాయించవద్దు
కలెక్టర్కి ఫోన్ ద్వారా వివరించిన మాజీ మంత్రి
వనపర్తి టౌన్ ఫిబ్రవరి 26: మెడికల్ కళాశాల ఆవరణంలో యంగ్ ఇండియా స్కూల్ కోసం స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం మెడికల్ కళాశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.
ఈ సందర్బంగా ఆయన కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు కలసి తమ కళాశాలకు భవిష్యత్తు తరాలకు వైద్య సహాయ మరియు వసతుల కోసం 51 ఎకరాల స్థలం కేటాయించి భావితరాల భవిష్యత్తుకు తమ హయాంలో పునాది వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, హేమంత్ ముదిరాజ్ , నీలస్వామి, మహేశ్వర్ రెడ్డి, స్టార్ రహీమ్, వెంకట్ సాగర్, చిట్యాల రాము,మంద రాము తదితరులు ఉన్నారు.




