calender_icon.png 9 June, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన హరీశ్ రావు విచారణ

09-06-2025 01:32:42 PM

కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన హరీశ్ రావు విచారణ

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీశ్ రావు(BRS MLA Harish Rao) విచారణ ముగిసింది. జస్టిస్ పీసీ ఘోష్ హరీశ్ రావును 40 నిమిషాలకు పైగా ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కమిషన్ కు హరీశ్ రావు వివరించారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాలు, తుమ్మిడిహట్లి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీ డిజైనింగ్ చేసినట్లు మాజీ మంత్రి హరీశ్ చెప్పారు. వాప్కోస్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు(Kaleshwaram Commission inquiry) స్థలం మారిందని ఆయన కమిషన్ కు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghose) మేడిగడ్డ, అన్నాం, సుందిళ్ల బ్యారేజీల గురించి హరీష్ రావును ప్రశ్నించారు. అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ఉన్నదని హరీష్ రావు పేర్కొన్నారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలం మార్పు ఇంజినీర్ల సూచన మేరకే జరిగిందని ఆయన ప్రాజెక్టుల స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత ఇంజినీర్ల చెప్పారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బ్యారీజీల స్థలం మార్పు ఇంజినీర్లు సూచన మేరకే జరిగిందన్నారు. టెండర్లు ఖరారు అయ్యాక ఎందుకు మార్పులు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ హరీశ్ రావును ప్రశ్నించారు. ప్రాజెక్టుల స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని చెప్పారు.

ప్రాజెక్టుకు రుణసేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, కంతనపల్లి ప్రాజెక్టుల స్థలాలు కూడా మార్చారని హరీష్ రావు చెప్పారు. టెండర్లు ఖరారు అయ్యాక ఎందుకు మార్పులు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. జలాశయాల నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలను పీసీ ఘోష్ అడిగారు. మరి బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు కేటాయించారని కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఇంజినీర్లు చూసుకునే అంశమని హరీశ్ రావు వివరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి  ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని హరీశ్ తెలిపారు.