బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలి
15-12-2025 10:18 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మాజీమంత్రి మల్లారెడ్డి, మంద సంజీవరెడ్డి
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలని సోమవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బోడుప్పల్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ ని కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ పరిశీలించి బోడుప్పల్ ప్రజలకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రటరీ మీసాల కృష్ణా, నాయకులు శ్రీహరి గౌడ్, ఉప్పరి విజయ్ పాల్గొన్నారు.






