16 April, 2026 | 10:06 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బీఆర్ఎస్ పార్టీ నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన తెలబాటి నరేష్

15-12-2025 10:12 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షులు, మాజీ ఐటి శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ని అలాగే మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకళ్ల జగదీశ్వర్ రెడ్డిని కీతవారిగూడెం గ్రామవాసి, గరిడేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు తెలబాటి నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ కోసం క్రియాశీలంగా పని చేస్తున్న కార్యకర్తలకు నాయకులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.