10-11-2025 03:51:50 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ప్రముఖ తెలంగాణ కవి రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి మాజీ మంత్రులు డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందెశ్రీ లోటు తీరనిదని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.