18 April, 2026 | 2:25 PM

కొత్త జంటను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

19-05-2025 12:00 AM

మునిపల్లి, మే 18 : మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బుర్ర నర్సింలు కుమారుడు ఎల్లప్ప,   కాసువాగుల ముంతాజ్ మేనకోడలు వివాహాలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మాజీ జడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పైతర మొగులయ్య, మాజీ ఉపసర్పంచ్ తుడుం దుర్గయ్య, పార్టీ అధ్యక్షులు మ్యాతరి మానయ్య,  మైనారిటీ అధ్యక్షులు మౌలానా, సీనియర్ నాయకులు ఫరూక్ పటేల్, తుడుం సుభాష్,మాజీ వార్డ్ మెంబర్స్ అంజయ్య గౌడ్, ఏక్బాల్, సురేష్, కాసువాగుల యూసుఫ్, మంగలి ఆనందం, కలాలి వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు.