సర్పంచ్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
30-12-2025 01:06 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్29: మండల పరిధిలోని నాణ్యతండా గ్రామ సర్పంచ్ కేలోతు కాంతమ్మ హరిలాల్ మామ కేలోతు లచ్చిరాం నాయక్ ఇటీవల మరణించారు.సోమవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.లచ్చిరాం నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్,జిల్లా నాయకులు మోరిశెట్టి ఉపేందర్ వివిధ గ్రామాల సర్పంచ్లు వల్లపు గంగయ్య,నున్న యాదగిరి,కలకోట్ల శైలేందర్,మాజీ సర్పంచ్ గుగులోతు మాణిక్యం,గ్రామశాఖ అధ్యక్షులు నాగునాయక్,గాదరి వెంకన్న,నాయకులు కీమానాయక్,లక్ష్మా,హేమ్ల తదితరులు పాల్గొన్నారు.






