13-06-2025 07:50:45 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): రాజు ఎక్కడున్నా రాజే అనే పదానికి రాజ్ గోపాల్ రెడ్డి నిదర్శనమని పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ముందుండే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అని మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పాటులో ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి ఎమ్మెల్యేల గెలుపు కోసం, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary Elections) కీలక భూమిక పోషించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంపీగా పార్లమెంట్లో తన గళాన్ని సోనియా గాంధీకి వినిపించి తెలంగాణ ఏర్పాటులో భాగస్వామి అయ్యాడని పదవులు ఉన్నా, లేకున్నా తన ప్రజా సేవ ఆగదని తెలంగాణ గడ్డమీద కెసిఆర్ ని ఓడించడానికి కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని గుర్తు చేశారు.
రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి నినాదంతోనే మునుగోడు ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో భాగం అవుతారని, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల ఆయన కలలే ప్రేరణగా నిలిచాయన్నారు. త్వరలోనే మునుగోడు ప్రాంతంలో డబుల్ రోడ్ల నిర్మాణానికి రూ.163.85 కోట్లు పంచాయితీ రాజ్ నిధులు ఆయన సిఫారసుతో మంజూరు అయ్యాయని, మునుగోడు ప్రాంతంలో రాబోయే ముడేండ్లలో శివన్న గూడెం ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయబోతున్నారని అన్నారు.రాజన్న ఎక్కడున్నా రాజే అని తెలిపారు.రాజన్న ఆత్మవిశ్వాసం, అసలైన నాయకత్వ లక్షణాలు ఎల్లప్పుడూ మాకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన స్ఫూర్తితో అభివృద్ధిలో పాలుపంచుకుంటామని అన్నారు.