26-01-2026 01:04:04 AM
కామారెడ్డి, జనవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డి ఎస్ పి గొల్ల లక్ష్మినారాయణ శనివారం హైదరాబాద్ లో అనారోగ్యంతొ మృతి చెందారు. ఆదివారం స్వగ్రామమైన దోమకొండ కు పార్దివ దేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొని మరింత వచ్చారు.
ఆయన పార్దివా దేహానికి మాజీ జడ్పీటీసీ తీగల తీర్మాల్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు ఆర్ టి వో యశ్వంత్ కుమార్ ను పరామర్శించారు. స్థానిక నాయకులు పెరిక సంఘం అధ్యక్షులు మర్రి శేఖర్, నల్లపు శ్రీనివాస్, పోచయ్య, శేఖర్, నర్సిములు నాగరాజు, తదితరులు వున్నారు.